భోపాల్, మార్చి 9: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాష్ట్ర సచివాలయం ‘వల్లభ్ భవన్’లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో గుర్తించిన పారిశుధ్య కార్మికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని..20 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు.