ఆర్కేపురం, జూన్ 19: ఎస్సీ వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని శనివారం శనివారం రంగారెడ్డి జిల్లా మాదిగ జేఏసీ యూత్ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నాయకుడు నక్క శరత్ కుమార్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వార్డుల అభివృద్ధి శరవేగంగా జరుగుతందని, ప్రత్యేక చొరవ తీసుకొని ఎస్సీ వార్డులను మరింత అభివృద్ధికి కృషి చేయాలని మేయర్ను కలిసినట్లు శరత్ కుమార్ తెలిపారు. అందుకు మేయర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మేయర్ను కలిసిన వారిలో ఎలిమినేటి ప్రశాంత్, రాజు, సాయి, సతీశ్, వినోద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.