ముంబై: మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మోషి ఏరియాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో (chemical company) గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి. క్రమంగా అవి రసాయన పరిశ్రమ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంగటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 30 ఫైరింజన్లతో కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
కాగా, ప్రమాదానికి గల కారాణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరికీ హాని జరగలేదని చెప్పారు. రూ.కోట్లలో ఆస్తినష్టం జరిగిందని పేర్కొన్నారు. అయితే అగ్నిప్రమాదం జరిగిన కంపెనీ సమీపంలో మరో ఏడు రసాయన పరిశ్రమలు ఉన్నాయని, అదృష్టవశాత్తు వాటికి మంటలు వ్యాపించలేదన్నారు.