Fire Breaks Out : మహారాష్ట్రలోని డొంబివ్లి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. థానే సమీపంలోని డొంబ్లివిలోని ఎంఐడీసీ ప్రాంతంలోని ఫ్యాక్టరీలో గురువారం మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మరణించారు. ఫ్యాక్టరీలోని ఓ బాయిలర్లో పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
ఘటనా స్ధలానికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని అధికారులు వెల్లడించారు.
#WATCH | Maharashtra: Fire breaks out due to a boiler explosion in a factory located in the MIDC area in Dombivli. More than four fire tenders rushed to the site.
Details awaited. pic.twitter.com/gsv1GCgljR
— ANI (@ANI) May 23, 2024
Read More :
Keerthy Suresh | ఏంటీ కీర్తిసురేశ్ లిప్లాక్ సీన్కు ఓకే చెప్పిందా..?