ఢిల్లీ : తూర్పు ఢిల్లీ మయూర్ విహార్ ఫేజ్ 1 ప్రాంతంలోని ఓ పేపర్ గోడౌన్లో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. పేపర్ గోడౌన్లో మంటలు చెలరేగడంతో ఘటనా స్ధలానికి హుటాహుటిన అగ్నిమాపక యంత్రాలను తరలించారు.
అగ్నిప్రమాదానికి కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదని ఈ ఘటనలో ఎవరూ గాయపడిన సమాచారం రాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న 23 అగ్నిమాపక యంత్రాలను మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
పేపర్ గోదాము నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించింది. అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
Read More :