జమ్మూ, జూన్ 25 : జమ్ముకశ్మీర్లోని కిష్టార్ జిల్లాలో సైన్యం, పోలీసుల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఫలితంగా కమాండింగ్ ఆఫీసర్తో సహా పలువురు సైనిక సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం పోలీసు స్టేషన్లోకి దూసుకు వచ్చిన జవాన్లు పోలీసులపై దాడి చేసి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ఒక సైనిక అధికారి వ్యక్తిగత వాహనాన్ని పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులను ఉటంకిస్తూ పిటీఐ తెలిపింది.
17వ రాష్ట్రీయ రైఫిల్స్(ఆర్ఆర్) కమాండింగ్ ఆఫీసర్ అరుణ్ గాంధీ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మేజర్ వికాస్ శర్మ, నైబ్ సుబేదార్ శంకర్ గుర్ఖే నేతృత్వంలో 30 నుండి 40 మంది సైనికులు ్రప్రహరీ గోడను ఎక్కి పోలీసు స్టేషన్లోకి చొరబడ్డారు. కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టి పోలీసులను చంపాలని భావించారు.