భోపాల్/న్యూఢిల్లీ/కోల్కతా, జూలై 6: పశ్చిబెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాపై మధ్యప్రదేశ్లో కేసు నమోదైంది. మంగళవారం ఇండియాటుడే కాంక్లేవ్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ‘కాళీమాత మాంసహారాన్ని, మద్యాన్ని అనుమతించే దేవత. ఒక వ్యక్తిగా ఈ మాట అనడానికి నాకు హక్కు ఉన్నది.
ఎవరైనా తమకు నచ్చిన రీతిలో పూజించుకునే హక్కు ఉన్నది’ అని పేర్కొన్నారు. దీంతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మహువా మాట్లాడారంటూ చాయ్ విక్రేత రాంచంద్ర భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు మహువా వ్యాఖ్యలపై టీఎంసీ స్పందించింది. ‘ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ట్వీట్ చేసింది. అయితే బీజేపీ మాత్రం మహువాను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నది.