నోయిడా, మే 24: పేటీఎం మాతృ సంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్లో 15 నుంచి 20 శాతం సిబ్బందిని తొలగించవచ్చని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. దీని ప్రకారం 5 వేల నుంచి 6,300 మంది ఉద్యోగులను ఇంటికి పంపే అవకాశం ఉంది.
వ్యయ నియంత్రణ, లాభదాయకత పెంపులో భాగంగా చేపట్టే ఈ తొలగింపుల కారణంగా రూ.400-500 కోట్లు ఆదా అవుతుందని ఆ సంస్థ భావిస్తున్నది. ఇప్పటికే తొలగింపును ప్రారంభించారని, డిసెంబర్లో 1,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేశారని తెలిసింది.