ప్రచారం: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్పీఎఫ్)లో 19,800 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.
వాస్తవం: ఈ సందేశం పూర్తిగా అబద్ధం. 19,800 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆర్పీఎఫ్ గానీ, రైల్వే శాఖ గానీ ఎలాంటి నోటిఫికేషన్ జారీచేయలేదని దక్షిణమధ్య రైల్వే స్పష్టం చేసింది. ఫేక్ న్యూస్పై అభ్యర్థులను అప్రమత్తం చేసింది. అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ను మాత్రమే సందర్శించాలని సూచించింది.