అది ఢిల్లీ మెట్రో.. రైలు వేగంగా కదులుతోంది. ఓ ఇద్దరు యువతీయువకుల మధ్య స్వల్ప వివాదం.. మొదట అబ్బాయిపై అమ్మాయి చేయి చేసుకుంది. అలా మొదలైన ఆ గొడవ ఇరువురి చెంపలు చెల్లుమనే దాకా తీసుకెళ్లింది. ఈ దృశ్యాలను మరో ప్రయాణికుడు తన కెమెరాలో బంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు.
అయితే ఆ అమ్మాయి ఓ టీ షర్ట్ను రూ. 1000కి కొనుగోలు చేసింది. ఆ విషయాన్ని యువకుడికి చెప్పగా.. అది అంత ఖరీదైన క్లాత్గా లేదు.. రూ. 150 కంటే ఎక్కువ ఉండదని సమాధానం ఇచ్చాడు. నేను అమ్మకు చెప్తానని ఆమె సమాధానం ఇవ్వగా.. నీ లాంటి వారు లేకున్నా పర్వాలేదని యువకుడు బదులిచ్చాడు. అలా ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అందరూ చూస్తుండగానే అతని చెంపపై రెండు, మూడు సార్లు వాయించింది. అతను కూడా ఆ యువతి చెంపపై కొట్టాడు. స్టేషన్ రాగానే ఇద్దరూ దిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Delhi metro entertainment 😂😂pic.twitter.com/LLdIDHB54N
— kartik (@Kartik_sharmaji) July 12, 2022