cheetah| భోపాల్: మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఆడ చీతా ‘నిర్భయ’ కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. దాని ఆచూకీ కోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఇప్పటిదాకా ఎలాంటి సానుకూల ఫలితం లభించలేదు. ఈ నేపథ్యంలో కునో నేషనల్ పార్క్ ట్రెక్కింక్ టీమ్ గాలింపు ప్రక్రియను ముమ్మరం చేసింది. కాలిముద్రలను గుర్తించడంతోపాటు డ్రోన్లను కూడా రంగంలోకి దించింది. చీతాను గుర్తించి, ఎన్క్లోజర్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.
ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను భారత్కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అనంతరం నాలుగు చీతాలు జన్మించాయి. మొత్తం 24 చీతాల్లో ఇప్పటిదాకా 8 చీతాలు మరణించారు. సహజ కారణాల వల్లే ఇవి మరణించాయని అధికారులు చెబుతున్నారు. అయితే చీతాల కదలికలను గుర్తించేందుకు వాటికి బిగించిన రేడియో కాలర్ల కారణంగానే అవి మృత్యువాతపడ్డట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో చీతాలకున్న రేడియో కాలర్లను అధికారులు తొలగిస్తున్నారు. ప్రస్తుతం 13 చీతాలు ఎన్క్లోజర్లో ఉన్నాయి. ఇప్పటిదాకా ఆరు చీతాలకు రేడియోకాలర్లను తొలగించి వైద్య పరీక్షలు నిర్వహించారు.