Smart Watch | న్యూఢిల్లీ: ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వాకింగ్, జాగింగ్ తదితర వ్యాయామాలు చేసే వారు రిస్ట్కు స్మార్ట్ వాచ్లను, బ్యాండ్లు, రింగ్లను ఉపయోగించటం కామన్గా మారింది. ఎన్ని కాలరీలు ఖర్చు చేశాం వంటి వివరాల వరకు ఓకే కానీ.. ప్రతీది స్మార్ట్ వాచ్పైనే ఆధారపడితే లాభం లేదంటున్నారు నిపుణులు. స్మార్ట్ వాచ్లు, రింగ్ల ద్వారా మీ బ్లడ్లో షుగర్ లెవెల్ ఎంతుంది? అని ఎప్పుడూ పరీక్షించుకోకండి.. ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదమున్నదని అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం హెచ్చరిస్తున్నది.
సాధారణంగా బ్లడ్లో షుగర్ లెవెల్ తెలుసుకోవటానికి సూదితో గుచ్చి రక్తం తీసి గానీ తెలుసుకోలేం.. కానీ రకరకాల బ్రాండ్ల పేరిట స్మార్ట్ వాచ్లు, రింగ్ల ద్వారా మీ బ్లడ్ షుగర్ లెవెల్ తెలుసుకోవచ్చంటూ ప్రచారం చేస్తున్నారు. ఇవి ఇచ్చే సమాచారం సరైనది కాదని, ఇలా తప్పుడు సమాచారంతో షుగర్కు వాడే మందుల మోతాదులు మారే అవకాశమున్నదని, అలా చేయటం వల్ల కొన్ని సార్లు ప్రాణాల మీదకు వస్తుందని ఎఫ్డీఏ హెచ్చరించింది.