చెన్నై : బెంగళూర్ నుంచి మాల్దీవులకు వెళుతున్న గో ఫస్ట్ విమానం తమిళనాడులోని కోయంబత్తూర్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. స్మోక్ అలారంలో లోపం కారణంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఇంజన్లు ఓవర్హీట్ కావడంతో అలారం పనిచేయలేదు. విమానం ప్రయాణించేందుకు అనువుగా ఉందని అలారం సరిగ్గా పనిచేయడం లేదని ఇంజనీర్లు ప్రకటించారు.
బెంగళూర్ నుంచి విమానం టేకాఫ్ అయిన గంట తర్వాత అలారం పనిచేయకపోవడంతో కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతించాలని పైలట్ కోరాడు. దీంతో విమానం కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం మధ్యాహ్నం 12.57 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది.
విమానంలో ఉన్న 92 మంది ప్రయాణీకులను దింపివేసి ఫ్లైట్ను పరీక్షించారు. ఇంజన్లను చెక్ చేసిన ఇంజనీర్లు అలారంలో లోపం ఉందని, విమానం ప్రయాణించేందుకు అనువుగా ఉందని ప్రకటించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇతర నిబంధనలను పూర్తి చేసిన అనంతరం విమానం మాల్దీవులకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.