న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో వీర మరణం పొందిన వారిలో లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్ (Kulwant Singh) కూడా ఒకరు. ఆయన మరణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుల్వంత్ సింగ్ భార్య, ఏడాదిన్నర పాప, ఐదు నెలల బాబు ఉన్నారు. అయితే, కుల్వంత్ సింగ్ తండ్రి కూడా ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు విధి నిర్వహణలోనే జమ్ముకశ్మీర్ బార్డర్ వీర మరణం పొందాడట.
కుల్వంత్ సింగ్ సవతి తండ్రి ఈ విషయాన్ని వెల్లడించారు. నా భర్త బల్దేవ్ సింగ్ నా కొడుకు కుల్వంత్కు ఏడాది వయసున్నప్పుడు విధి నిర్వహణలో భాగంగా సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయాడని కుల్వంత్ సింగ్ తల్లి తెలిపారు. బల్దేవ్ మరణం అనంతరం ఆమె రెండో పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు.