ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్యోగులను తీసుకుని వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్ 40 అడుగుల లోతైన మట్టిగనిలోకి బోల్తా పడటంతో 15 మంది మరణించగా, 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం దుర్గ్ జిల్లాలోని ఖాప్రీలో మంగళవారం రాత్రి 8.30 గంటలకు చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ డిస్టిలరీలో పనిచేస్తున్న ఉద్యోగులను డ్యూటీ ముగిసిన తర్వాత తీసుకుని వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.