Farmers | సాంగ్లి (మహారాష్ట్ర) : రైల్వే ట్రాక్ల నిర్మాణం కోసం తమ భూములను స్వాధీనం చేసుకుని, తమకు నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపిస్తూ దాదాపు 100 మంది రైతులు కొల్హాపూర్-గోండియా మహారాష్ట్ర ఎక్స్ప్రెస్ రైలును బుధవారం దాదాపు నాలుగు గంటలపాటు నిలిపేశారు.
భిల్వాడీ-నాంద్రే సెక్షన్లో పాలుస్ తహశీలు వద్ద ఈ సంఘటన జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ రాజా దయానిధి చెప్పారు. ఈ నెల 15న రైతులతో సమావేశాన్ని నిర్వహిస్తామని జిల్లా అధికారులు, రైల్వే అధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాత రైల్ రోకోను విరమించారని తెలిపారు.