Farmers Movement | కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా గతేడాది పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కనీస మద్దతు ధర, రుణాల రద్దు, విద్యుత్ రంగం ప్రైవేటీకరణ ఉపసంహరణ, రైతులకు పింఛన్లను డిమాండ్ చేస్తూ మరోసారి ఆందోళనకు రెడీ అయ్యారు. హర్యానా నుంచి రైతుల పాదయాత్ర ఢిల్లీకి చేరనున్నది. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని అధికార యంత్రాంగం నిర్వహించింది. మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్ చేయనున్నారు. సిర్సా, హిసార్, అంబాలా, జింద్, కైతాల్, కురుక్షేత్ర, ఫతేహాబాద్లో ఫిబ్రవరి 11 రాత్రి నుంచి ఫిబ్రవరి 13 అర్ధరాత్రి 12 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నారు.
ఫిబ్రవరి 13న ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించాలని రైతు సంఘాలు ఇచ్చిన పిలుపునిచ్చిన నేపథ్యంలో హర్యానా పోలీసులు ప్రయాణికులకు పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రధాన రహదారులను ఉపయోగించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. హర్యానా నుంచి పంజాబ్ వరకు అన్ని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పంజాబ్కు వెళ్లాలని సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ఎలాంటి హింసాకాండ జరగకుండా, ట్రాఫిక్, ప్రజారవాణా వ్యవస్థను సులభతరం చేసేందుకు పోలీసు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు.