న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన సహా పలు డిమాండ్ల సాధనలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ అణచివేత విధానాలను అవలంబిస్తున్నదని రైతు సంఘాలు ఆరోపించాయి. రైతుల సమస్యల సాధనకు ఈ నెల 14న రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించే మహాపంచాయత్కు పెద్దయెత్తున తరలి రావాలని అఖిల భారత కినాస్ సభ అధ్యక్షుడు అశోక్ దవాలే పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలపై అన్నదాతలు గత నెల రోజులకు పైగా చేపట్టిన ఉద్యమ తీవ్రతను ప్రభుత్వం చవిచూసిందని అన్నారు. టియర్ గ్యాస్ షెల్స్, లాఠీచార్జిలతో తమ ఉద్యమాన్ని అణవివేయాలని ప్రయత్నించినా రైతులు ఎంతమాత్రం వెరవలేదని పేర్కొన్నారు.