న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో.. దాదాపు 15 నెలలుగా ఆందోళన చేపడుతున్న రైతులు నిష్క్రమిస్తున్నాడు. ఘాజిపూర్, సింఘూ, టిక్రి బోర్డర్లను విడిచి రైతులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. కొత్త సాగు చట్టాలను ప్రభుత్వం రద్దు చేయడంతో.. అన్నదాతలు తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ఢిల్లీ-యూపీ బోర్డర్ వద్ద ఉన్న ఘాజిపూర్ నుంచి రైతులు వెళ్లిపోతున్నారు. సింఘూ బోర్డర్ను కూడా రైతులు ఖాళీ చేస్తున్నారు. అక్కడ వేసిన టెంట్లను తొలగించేశారు. టిక్రి బోర్డర్ వద్ద రైతులు సంబరాలు చేసుకున్నారు. చిందులు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆందోళన చేపడుతున్న అన్ని ప్రదేశాల నుంచి టెంట్లను తొలగించారు.
ఘాజీపూర్ బోర్డర్ వద్ద బీకేయూ నేత రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడారు. ఆందోళన సమయంలో సహకరించిన వారిని కలుస్తామన్నారు. ఇప్పటికే అన్ని బోర్డర్ల నుంచి రైతులు ఖాళీ చేస్తున్నారని, డిసెంబర్ 15వ తేదీన ఈ ప్రాంతం నుంచి వదిలి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.