బర్నాల (పంజాబ్), జనవరి 6: రైతుల పంటలకు కనీస మద్దతు ధర హామీని కల్పించే చట్టాన్ని రూపొందించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా, 18 రైతు సంఘాల ఆధ్వర్యంలో శనివారం పంజాబ్లోని బర్నాలలో నిర్వహించిన మహాపంచాయత్ డిమాండ్ చేసింది.
ఫిబ్రవరి 13న ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చింది. అంతేకాకుండా యూపీలోని లఖింపురీ హింసలో బాధిత రైతులకు న్యాయం చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ జగ్జిత్ సింగ్ దాలేవాల్ అన్నారు. రైతు చట్టాల ఎత్తివేత డిమాండ్ ఆందోళనలో అసువులు బాసిన రైతులకు సంస్మరణగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.