న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ రైతులు చేపట్టిన నిరసన ఉద్యమ హోరును తలపిస్తుందని, త్వరలో దేశ రాజధాని పెనువిప్లవం చూడబోతోందని బీకేయూ నేత రాకేష్ తికాయత్ కేంద్ర ప్రభుత్వాన్ని శనివారం హెచ్చరించారు. ట్రాక్టర్లు కదిలితేనే ఢిల్లీలో ప్రకంపనలు రేగుతాయని అన్నారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీల వివరాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఢిల్లీ సరిహద్దుల్లో వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనను ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయని చెప్పారు.
రైతుల ఆందోళన ఏడు నెలలు పూర్తి కావడంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు, యువత, మహిళలు చండీఘడ్ చేరుకుంటుండగా పోలీసులు వారిని బారికేడ్లతో నిలువరించారు. పలుచోట్ల వారిని చెదరగొట్టేందుకు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. పంజాబ్, హర్యానా గవర్నర్లకు వినతి పత్రాలు సమర్పించేందుకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇక అరెస్ట్ చేసిన రైతులను తిహార్ జైలుకు పంపాలని లేదా గవర్నర్తో వారిని కలిసేలా ఏర్పాట్లు చేయాలని బీకేయూ నేత రాకేష్ తికాయత్ డిమాండ్ చేశారు.