అనుప్పూర్, ఆగస్టు 16: బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో బతుకే కాదు చావు కూడా దుర్భరంగా మారింది. ఓ గ్రామంలో ఓవ్యక్తి మరణిస్తే అంత్యక్రియలకు బంధువులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అనుప్పూర్ జిల్లా తాడపతారా గ్రామానికి చెందిన విస్మత్ నంద (55) అనే వ్యక్తి పక్కనే ఉన్న డిండోరీ జిల్లాలోని ఓ ప్రభుత్వ దవాఖానలో చనిపోయాడు.
మృతదేహాన్ని సొంతూరు తీసుకెళ్లాలని బంధువులు చూశారు. నర్మదా నది తీవ్రంగా ఉప్పొంగుతుండటంతో తాడపతారా గ్రామానికి వెళ్లే దారి పూర్తిగా జలమయమైంది. చేసేదేమీ లేక మృతదేహానికి తేలే రబ్బర్ ట్యూబుకు కట్టి నది దాటించి ఊరికి తీసుకెళ్లారు. ఇలా తీసుకెళ్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నది.