Air India | విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో మంటలు రాజుకున్నట్లు అలర్ట్ రావడం తీవ్ర కలకలానికి దారి తీసింది. ఈ అలర్ట్తో వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. అనంతరం విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో బుధవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ814 విమానం ఢిల్లీ నుంచి ముంబై బయల్దేరింది. విమానం ముంబై (Mumbai)లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడానికి ముందు ఇంజిన్లో మంటలు చెలరేగినట్లు అలర్ట్ వచ్చింది (False engine fire alarm). దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్లు ముందు జాగ్రత్తగా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ విషయాన్ని వెంటనే ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు. కాసేపటికి విమానం ముంబై ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం జరిపిన తనిఖీల్లో ఇంజిన్లో ఎలాంటి మంటలూ చెలరేగలేదని తేలింది. కనీసం పొగ కూడా లేనట్టు వెల్లడైంది. ఈ మేరకు ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు ప్రారంభించింది.
Also Read..
Parliament breach | లోక్సభలో భద్రతా వైఫల్యం.. పోలీసుల అదుపులో మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు
COVID-19 | దేశంలో కొత్తగా 358 మందికి కరోనా.. 2669కి చేరిన పాజిటివ్ కేసులు