లఖింపూర్ ఖీరీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీలో నకిలీ రసాయన ఎరువుల తయారీ కలకలం రేపింది. సూక్ష్మ పోషకాల తయారీకి లైసెన్స్ పొందిన ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో నకిలీ రసాయన ఎరువులను తయారు చేస్తున్నారు. ఫ్యాక్టరీలోని ఏడు గోడౌన్లలో సోదాలు నిర్వహించామని, లైసెన్స్ను ఉల్లంఘించినందుకు ఫ్యాక్టరీని సీజ్ చేసినట్టు అధికారులు శనివారం వెల్లడించారు. ఫ్యాక్టరీ అక్రమంగా పెద్దయెత్తున నిల్వ ఉంచిన నకిలీ ఎరువులను గుర్తించామని తెలిపారు. స్వాధీనం చేసుకొన్న ఖాళీ బస్తాలపై ప్రముఖ కంపెనీల పేర్లు ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి వివరించారు.