న్యూఢిల్లీ: అయోధ్య ప్రసాదం పేరుతో స్వీట్ల అమ్మకంపై కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ అథారిటీ(సీసీపీఏ) జారీ చేసిన నోటీసులపై ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ స్పందించింది. తమ విధానానికి అనుగుణంగా అటువంటి లిస్టింగ్లపై తగిన చర్యలు తీసుకొంటున్నట్టు శనివారం పేర్కొన్నది.
కొంత మంది అమ్మకందారులు పెట్టిన తప్పదోవ పట్టించే ఉత్పత్తులకు సంబంధించి సీసీపీఏ నుంచి నోటీసు వచ్చిందని పేర్కొన్న అమెజాన్.. ఉల్లంఘనకు పాల్పడిన వారిపై దర్యాప్తు చేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది.