భారత సరిహద్దులను కాపాడటంలో కీలక పాత్ర పోషించే ‘చినార్ కార్ప్స్’ అనే సైన్యం విభాగానికి చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలను ఫేస్బుక్ యాజమాన్యం బ్లాక్ చేసేసింది. ఇలా బ్లాక్ చేసి ఇప్పటికి ఓ వారమైంది. ఈ విషయాన్ని ఓ జాతీయ ఛానల్ వెల్లడించింది. ఈ విషయాన్ని తాము ఫేస్బుక్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని, అయినా ఎలాంటి స్పందనా లేదని ‘చినార్ కార్ప్స్’ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ‘మీరు క్లిక్ చేసిన లింక్ పనిచేయడం లేదు. ఈ లింక్ను తొలగించారు’ అన్న మెసేజ్ వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. జమ్మూ కశ్మీర్ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలు, అపోహలకు అడ్డుకట్ట వేయడానికి చినార్ కార్ప్స్ ఉన్నతాధికారులు ఫేస్బుక్ అకౌంట్ను ఓపెన్ చేశారు. కశ్మీర్ లోయ, శ్రీనగర్ ప్రాంతాల్లో స్పెషల్ ఆపరేషన్ల నిమిత్తమై కేంద్రం ప్రత్యేకంగా ఈ సైన్యాన్ని ఏర్పాటు చేశారు.