న్యూఢిల్లీ : విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్కు (S Jaishankar) కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. జైశంకర్కు జడ్ క్యాటగిరీ భద్రత కల్పించాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. జడ్ క్యాటగిరీ భద్రతలో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ రక్షణ కోసం ఏకంగా 33 మంది సీఆర్పీఎఫ్ కమెండోలను నియమించింది.
జైశంకర్ భద్రతను అప్గ్రేడ్ చేసినట్టు హోంమంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అంతకుముందు జైశంకర్కు కేంద్రం వై క్యాటగిరీ భద్రతను కల్పించింది.
Read More :
Fire Accident | ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం..