ఇంఫాల్, అక్టోబర్ 11: మణిపూర్లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధాన్ని ఈ నెల 16 వరకు పొడిగిస్తూ మణిపూర్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో శాంతి స్థాపనకు, మతపరమైన ఉద్రిక్తతలను నివారించి తద్వారా మరణాల సంఖ్యను తగ్గించడానికి ఇంటర్నెట్పై నిషేధాన్ని పొడిగించినట్టు హోం శాఖ ప్రకటించింది. కాగా, మణిపూర్లో హింస చోటుచేసుకున్న తర్వాత మే 3న ఇంటర్నెట్పై నిషేధం విధించి సెప్టెంబర్ 23న పునరుద్ధరించారు. తిరిగి అదే నెల 26 నుంచి నిషేధాన్ని కొనసాగిస్తున్నారు.