బదంపహార్ (ఒడిశా), నవంబర్ 21: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంతూరుకు తొలిసారి ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టింది. ఆమె సొంతూరైన ఒడిశాలోని రైరాంగ్పూర్కు ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టడం 112 ఏండ్లలో ఇదే తొలిసారి.
మంగళవారం ఒడిశాలో పర్యటించిన ముర్ము మూడు కొత్త రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక ప్రాంత అభివృద్ధి అనేది ఆ ప్రాంతంతో ఇతర ప్రాంతాలకు ఉన్న రాకపోకలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.