బక్సర్, అక్టోబర్ 11: బీహార్లో ఒక ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. బక్సర్ జిల్లాలోని రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్కు చెందిన ఐదు బోగీలు బుధవారం సాయంత్రం పట్టాలు తప్పాయి. ఇందులో మూడు ఏసీ బోగీలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి వస్తున్న ఈ రైలు అస్సాంలోని కమాఖ్య జంక్షన్కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.