న్యూఢిల్లీ, జనవరి 28: భారత్ తొలిసారిగా విదేశానికి బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేయనుంది. ఫిలిప్పీన్స్కు ఈ క్షిపణులను విక్రయించనుంది. ఇందుకు రెండు దేశాల మధ్య రూ.2,800 కోట్ల ఒప్పందం కుదిరింది. బ్రహ్మోస్ మిస్సైల్ సిస్టమ్ను సరఫరా చేసేందుకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్(బీఏపీఎల్), ఫిలిప్పీన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్షిపణులను భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.