జమ్ము: ప్రధాని మోదీ (PM Modi) జమ్ము పర్యటనకు కొన్ని గంటల ముందు అనుకోని ఘటన జరిగింది. గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న పల్లీ గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాలియానాలో పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం లాలియానాలోని ఓ వ్యవసాయ భూమిలో పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడు జరిగిన తీరుపై విచారణ చేపట్టారు. కాగా, ఇది ఉగ్రవాద చర్యగా అనిపించడంలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Jammu | "Suspected blast" reported by villagers in open agricultural land in Lalian village, Bishnah
Suspecting it to be a lightning strike or a meteorite; Investigation is underway, say police. pic.twitter.com/6PFaD8hHN0
— ANI (@ANI) April 24, 2022
370 అధికరణం రద్దు చేసిన తర్వాత ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్లో పర్యటించిండం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా బనిహాల్-కాజీగుండ్ సొరంగ మార్గంతో పాటు, రూ.20 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అదేవిధంగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ సౌర విద్యుత్ ప్లాంట్ను కూడా ప్రారంభించనున్నారు.