Mumbai | ముంబైలోని ఐఎన్ఎస్ రణవీర్ నౌకలోలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు నేవీ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. 11 మంది సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది, మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ముంబైలోని డాక్యార్డులో నౌకను నిలిపిన సమయంలో ఈ ఘటన జరిగింది. అంతర్జాతీయ సరిహద్దు జలాల్లో ఐఎన్ఎస్ రణవీర్ విధులు నిర్వర్తిస్తూ వుంటుంది. ఐఎన్ఎస్ రణవీర్ నౌకలో ఈ రోజు పేలుడు సంభవించింది. ముగ్గురు నేవీ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. అత్యంత దురదృష్ట ఘటన ఇది అంటూ రక్షణ శాఖ పేర్కొంది.