లక్నో: ఉత్తరప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్పై ఈసీ నిషేధం విధించింది. ఫిబ్రవరి 10 ఉదయం ఏడు గంటల నుంచి మార్చి 7 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది. ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం, ప్రచారం చేయడంపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అజయ్ కుమార్ శుక్లా పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. అయితే పోలింగ్ రోజుకు 48 గంటల ముందు ప్రారంభమయ్యే ‘నిశ్శబ్ద కాలం’లో మీడియాలో కూడా ఒపీనియన్ పోల్స్ నిషేధిస్తారు. ఇందులో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్లో ఈసారి నాలుగు పార్టీల మధ్య పోటీ నెలకొన్నది. రాష్ట్రంలోని అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ, మాయావతికి చెందిన బీఎస్పీతోపాటు కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి.