హైదరాబాద్: సభా కార్యకలాపాలు జరుగుతుండగా, ఇద్దరు వ్యక్తులు గ్యాస్ కేన్లతో పార్లమెంట్ లోపల అలజడి సృష్టించడం స్పష్టంగా భద్రతా వైఫల్యాన్ని చాటుతున్నదని పార్లమెంట్ సెక్యూరిటీ మాజీ అధికారి వీ పురుషోత్తమ రావు అభిప్రాయపడ్డారు.
2001లో పార్లమెంట్పై ఉగ్రవాదుల దాడి సందర్భంగా విధుల్లో ఉన్న ఆయన ఒక ఉగ్రవాదిని కాల్చి చంపారు. డీఐజీ ర్యాంకులో రిటైరైన ఆయన బుధవారం పీటీఐతో మాట్లాడారు. పార్లమెంట్పై దాడి అనంతరం అప్పటి డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ లోక్సభ భద్రతపై పలు సిఫార్సులను చేసిందన్నారు. ఆ సిఫార్సులను అమలు చేసి ఉంటే ఇలాంటి ఘటన చోటుచేసుకుని ఉండేది కాదన్నారు. విజిటర్స్ గ్యాలరీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఏర్పాటు చేయాలని కమిటీ తన సిఫార్సుల్లో పేర్కొందన్నారు.