న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే రాజేశ్ లిలోతియా సతీమణి మధు లిలోతియా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆమెను హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్లోని ట్రామా సెంటర్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.
సోమవారం రాత్రి మధు లిలోతియా తన కారులో వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన ఓ ఎస్యూవీ అమెను ఢొకొట్టింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమైన ఎస్యూవీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఢిల్లీలోని కశ్మీరీ గేట్ ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.