మధ్యప్రదేశ్ బీజేపీ సర్కార్పై మాజీ జవాన్లపై ఆగ్రహం
భోపాల్, జూన్ 18: అగ్నివీరులకు సీఏపీఎఫ్లో, రక్షణ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది. కానీ అదే బీజేపీ.. మధ్యప్రదేశ్ పోలీసు ఉద్యోగాల్లో మాజీ సైనికులకు దక్కాల్సిన రిజర్వేషన్లను రద్దు చేసింది. తమకు దక్కాల్సిన ఉద్యోగాల కోసం రాష్ట్రంలోని మాజీ సైనికులు ఏప్రిల్ నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైన్యంలో పనిచేసిన వారికి మధ్యప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్లో 10% రిజర్వేషన్ ఉండేది.
1999 నుంచి ఇది అమలవుతున్నది. కానీ, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ విధానాన్ని ఆపేసింది. రిజర్వేషన్ను పాటించడం లేదు. ఇటీవల మధ్యప్రదేశ్లో 6వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశారు. రిజర్వేషన్ ప్రకారం మాజీ సైనికులకు 600 ఉద్యోగాలు కేటాయించాలి. కానీ కేవలం ఆరుగురిని మాత్రమే ఎంపిక చేశారు. దీనిపై ఇప్పటికే పలువురు మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్లారు.