Prasar Bharati |ప్రసార భారతీ నూతన చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహ్గల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్ సారధ్యంలోని సెలెక్షన్ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసారభారతి చైర్మన్గా నవనీత్ కుమార్ సెహ్గల్ను శుక్రవారం నియమించారని కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నాలుగేండ్లుగా ఈ పోస్టు ఖాళీగా ఉంది. 2020 ఫిబ్రవరిలో ఏ సూర్య ప్రకాశ్ (70) పదవీ విరమణ చేసిన తర్వాత ఈ పదవి ఖాళీగా ఉంది. ఆయన స్థానంలో నవనీత్ కుమార్ సెహ్గల్ నియమితులయ్యారు.
1988 ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ బ్యాచ్ అధికారి నవనీత్ కుమార్ సెహ్గల్. ఆయన గతేడాది రిటైర్ అయ్యారు. యూపీ అదనపు ప్రధాన కార్యదర్శిగా రిటైరైన నవనీత్ కుమార్ సెహ్గల్.. స్పోర్ట్స్, యువజన సంక్షేమం తదితర శాఖలను నిర్వహించారు. శుక్రవారం జగదీప్ దన్ఖడ్ అధ్యక్షతన జరిగిన సెలెక్షన్ కమిటీ సమావేశానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) రంజనా దేశాయి, కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు హాజరయ్యారు.