కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓటింగ్(West Bengal Polls) అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫాల్టాలో ఈవీఎంల బటన్లకు టేపు వేసినట్లు బీజేపీ ఆరోపించింది. ఆ ఆరోపణలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి స్పందించారు. ఒకవేళ ఏదైనా ఈవీఎం బటన్ను ట్యాంపర్ చేస్తే, ఆ పోలింగ్ బూత్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో రెండో దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో పోలింగ్ అధికారులు ఓటర్లను అడ్డుకుంటున్నారని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల బటన్లకు టేపులు వేశారని బీజేపీ ఆరోపించింది. అయితే ఇలాంటి ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలోనే పరిశీలించనున్నట్లు సీఈసీ తెలిపారు.
బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ వివాదానికి తెరలేపారు. ఫాల్టాలోని అనేక పోలింగ్ బూతుల్లో తమ పార్టీకి ఓటు వేసే ఆప్షన్ను బ్లాక్ చేశారన్నారు. ఈవీఎం బటన్పై టేపు వేసి ఓటు వేయకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. తన ఎక్స్ అకౌంట్లో మాల్వియా స్పందిస్తూ ఇది డైమండ్ హార్బర్ మోడల్ అని విమర్శించారు. ఈవీఎం బటన్లకు టేపు వేసిన పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా దీపక్ కుమార్ హాల్దర్, టీఎంసీ సిట్టింగ్ ఎమ్మెల్యే పన్నాలాల్ హాల్దర్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పన్నా లాల్ 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
డైమండ్ హార్బర్ మోడల్ అన్న టైటిల్తో బీజేపీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈవీఎంపై ఉన్న ఆ పార్టీ బటన్ను టేపుతో బ్లాక్ చేశారు. ఇక ఇవాళ ఉదయం 11 గంటల వరకు రెండో దశలో సుమారు 40 శాతం ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే పుర్బా బర్దమాన్లో 44.50 శాతం, హూగ్లీలో 43.12 శాతం, కోల్కతా నార్త్లో 38.39 శాతం, కోల్కతా సౌత్లో 36.78 శాతం ఓట్లు పోలయ్యాయి. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నది.
This is what Mamata Banerjee was defending when she spoke up for Jehangir Khan, a criminal contesting on a TMC ticket from Falta in Diamond Harbour.
In several polling booths, the option to vote for the BJP has been blocked using a tape, effectively preventing voters from… pic.twitter.com/sKw3mcdA86
— Amit Malviya (@amitmalviya) April 29, 2026