న్యూఢిల్లీ, అక్టోబర్ 15: పరోటా మీద 18 శాతం జీఎస్టీ విధించాలంటూ గుజరాత్ అప్పిలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఏఆర్) నిర్ణయించడంపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆహార పదార్థాలపై బ్రిటిష్ వాళ్లు కూడా ఇలాగా పన్నులు వేయలేదని ధ్వజమెత్తారు. రోటీ, చపాతి, పరోటా ఒకటే కాదని.. కాబట్టి పరోటాపై 18 శాతం జీఎస్టీ విధించాలని ఏఏఏఆర్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘దేశంలో ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణాల్లో జీఎస్టీ కూడా ఒకటి. ఆహార పదార్థాలపైనా ఈ పన్ను విధించడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. నాకు తెలిసి ఆహార పదార్థాలపై బ్రిటిష్వాళ్లు కూడా ఇలా పన్నులు వేయలేదు’ అని విమర్శించారు.