న్యూఢిల్లీ: చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై ఏం చేయాలని కోరుకున్నామో అది చేసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం విలేకర్లతో చెప్పారు.
ప్రస్తుత నిద్రాణ స్థితి నుంచి అది తిరిగి పని చేసే స్థితికి రాకపోయినప్పటికీ సమస్య ఏమీ ఉండదని తెలిపారు. నవంబరు లేదా డిసెంబరులో ఎక్స్-రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని ప్రయోగించడంపై దృష్టి సారించామన్నారు.