న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: హాలీడేస్ కోసం కుటుంబంతో యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, బడ్జెట్ను మరోసారి సరిచూసుకోండి. ఎందుకంటే 90 రోజుల ట్రిప్ (పర్యాటక వీసా) చార్జీలను పెంచాలని యూరప్ ప్రతిపాదించింది. ఇది కుటుంబం టూర్పై ఆర్థికభారం పెంచనున్నది.
ప్రతిపాదించిన సవరణ ప్రకారం.. పెద్దలకు గతంలో చార్జీలు 80 యూరోలు ఉండగా ఇప్పుడు 90కి, చిన్నారులకు 40 యూరోలుగా ఉండగా ప్రస్తుతం 45 యూరోలకు పెరుగుతాయి. ఇండియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, చైనా దేశాల వారికి వీసా పెంపు భారం పడనున్నది.