న్యూఢిల్లీ, డిసెంబర్ 11: యూరోపియన్ పార్లమెంట్ (ఈయూ), సభ్య దేశాలు కృత్రిమ మేధ నియంత్రణకు ప్రపంచంలోనే మొట్టమొదటగా సమగ్ర చట్టాన్ని రూపొందించాయి. ఈ ఒప్పందం చారిత్రాత్మకమైనదని, ప్రపంచ పోటీని ముందుకు నడిపించడానికి ఈయూ స్టార్టప్స్, పరిశోధకులకు ఈ చట్టం లాంచ్ప్యాడ్ లాంటిదని యూరప్లో సూట్ ఆఫ్ లాస్కు బాధ్యుడైన థియెర్రీ బ్రెటన్ తెలిపారు. అయితే ఈ చట్టం 2025 వరకు అమలు కాకపోవచ్చని అధికారులు తెలిపారు. ఈ చట్టంలో నిబంధనల రూపకల్పన కోసం వివిధ రంగాల వారితో చర్చలు జరిపారు. కృత్రిమ మేధను నియంత్రించడం కష్టమైన పని అని.. దీనిపై ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.