న్యూఢిల్లీ: 250 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇథియోపియన్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇంథియోపియన్ ఎయిర్లైన్స్కు (Ethiopian Airlines flight) చెందిన బోయింగ్ 777-8 ఈటీ 687 విమానం ఢిల్లీ నుంచి ఇథియోపియాలోని అడిస్ అబాబాకు (Addis Ababa) వెళ్తున్నది. ఈ క్రమంలో విమానం కాక్పిట్లో (Cockpit) పొగలు రావడాన్ని గమనించిన పైలట్.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశాడు (Emergency Landing).
ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. విమానంలో 240 మందికిపైగా ఉన్నారని చెప్పారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే విమానాశ్రయానికి తిరిగి వచ్చి అత్యవసర ల్యాండ్ అయిందని విమానంలో ఉన్న ఒక ప్రయాణికుడు చెప్పారు. విమానం కాక్పిట్లో పొగ రావడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యామని చెప్పారు. సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఇలా జరిగిందని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.