Hema Malini | బాలీవుడ్ ప్రముఖ జంట డ్రీమ్ గర్ల్ హేమ మాలినీ, ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతోంది. ఆమె తన భర్త భారత్ తఖ్తానీతో విడాకులు తీసుకుంది. దాదాపు 11 ఏండ్ల వైవాహిక బంధానికి ముగింపు చెప్పింది. తాజాగా వీరిద్దరూ విడిపోయారనే విషయాన్ని బయటపెట్టారు. వారి విడాకుల వార్తలతో వారి కుటుంబం కూడా ఎలాంటి ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు. అయితే తండ్రి ధర్మేంద్ర మాత్రం ఈషా డియోల్ తన నిర్ణయంపై మరో సారి ఆలోచిస్తే బాగుంటుందని అభిప్రాయపడగా, తల్లి హేమ మాలిని మాత్రం భవిష్యత్తులో ఈషా డియోల్ రాజకీయాల్లోకి రావచ్చని ఓ చిన్న హింట్ ఇచ్చింది.
ప్రస్తుతం హేమమాలిని బీజేపీ పార్టీనుంచి మధుర లోకస్ధానం నుంచి సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీ తరువాత కూడా మీ కుటుంబంలోని వారు రాజకీయాల్లో రావాలనుకుంటున్నారా అన్న విలేకరి ప్రశ్నకు హేమామాలిని జవాబు చెబుతూ.. `వారు కావాలంటే రావచ్చు. ఎలాంటి ఇబ్బుందులు లేవు` అని చెప్పారు. ఈషా డియోల్ గురించి కూడా హేమ మాలిని మాట్లాడుతూ.. `ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉంది. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ప్రవేశిస్తే ప్రవేశించవచ్చు` అని జవాబిచ్చారు. ఇటీవల ఆమె అయోధ్య రామాలయాన్ని కూడా దర్శించుకున్నారు. ప్రస్థుతం ఆమె అయోధ్యలో జరుగుతున్న రాగ్ సేవలో పాల్గొంటున్నారు.