ముంబై, డిసెంబర్ 30: సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన ఉద్యోగుల కోసం అధిక పింఛన్పై ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) తాజాగా ఓ సర్క్యులర్ను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఉంటేనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గత నెల సుప్రీం కోర్టు.. ఎంప్లాయీస్ పెన్షన్ (సవరణ) పథకం 2014ను సమర్థించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎంప్లాయీస్ పెన్షన్ పథకం (ఈపీఎస్) పొందుతున్న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సభ్యులకు వచ్చే నాలుగు నెలల్లో అధిక పింఛన్ను ఎంచుకునేలా మరో అవకాశం ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. దీంతో 2014 సెప్టెంబర్ 1 నాటికి ఈపీఎస్ సభ్యులుగా ఉన్న ఉద్యోగులకు పెన్షన్ కోసం.. నెలకు రూ.15,000లకే పరిమితం చేసిన తమ పెన్షన్ జీతంలో 8.33 శాతానికి బదులుగా, తమ అసలు జీతాల్లో 8.33 శాతం వరకు చెల్లించినవారికి అవకాశం లభించింది.
అర్హులు ఎవరంటే..
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అర్హులైన ఈపీఎస్ సభ్యులు తొలుత వారికి సంబంధించిన ప్రాంతీయ ఈపీఎఫ్వో కార్యాలయాలకు వెళ్లాలి. అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తును సమర్పించాలి. కమిషనర్ సూచించిన పద్ధతిలో ఆ దరఖాస్తు ఉండాల్సి ఉంటుంది. కాగా, ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్ నుంచి పెన్షన్ ఫండ్కు సర్దుబాట్లు, ఫండ్కు రీ-డిపాజిట్ అవసరమైతే అందుకోసం దరఖాస్తు ఫారంలో పెన్షనర్ స్పష్టమైన సమ్మతిని తెలియజేయాలి.