Pollination | న్యూఢిల్లీ, డిసెంబర్ 20 : పర్యావరణ మార్పులు కొన్ని లక్షల కీటక జాతులను అంతమొందిస్తున్నాయి. దీంతో మొక్కలు, పువ్వుల్లో పరపరాగ సంపర్కం తగ్గిందని, కీటకాల్ని పువ్వులు ఆకర్షించటం తగ్గినందు వల్లే ఈ పరిణామం ఏర్పడిందని ‘న్యూ ఫైటాలజిస్ట్’ జర్నల్ కథనం పేర్కొన్నది. దీని ప్రకారం, గత 150 ఏండ్లులో 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కీటక జాతులు కనుమరుగయ్యాయి. కీటకాల జనాభాల్లో ఏటా 2 శాతం తగ్గుదల నమోదైందని నివేదిక తెలిపింది. పువ్వులు, మొక్కలు కీటకాల కోసం మకరందాల్ని తయారుచేస్తాయి. బదులుగా కీటకాలు మొక్కల మధ్య పుప్పొడిని రవాణా చేస్తాయి.