న్యూఢిల్లీ, అక్టోబర్ 28: దేశంలో ఆన్లైన్ కోర్సులకు డిమాండ్ పెరుగుతున్నదని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేస్తున్న కోర్సులకు ఈ ఏడాది 72 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. గత ఏడాది 25,905 మంది నమోదు చేసుకున్నారని చెప్పారు. అంటే ఈ ఏడాది 179 శాతం పెరుగుదల నమోదైందని వివరించారు. అలాగే ఓపెన్, డిస్టెన్స్ విద్య కోసం 2020-21లో 14 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకోగా.. 2021-22లో 20 లక్షలకుపైగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.