కార్పొరేట్ ఉద్యోగం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఉద్యోగం రావడానికే ఎంతో కష్టపడతారు. అటువంటిది ఉద్యోగాన్ని చిన్న చిన్న కారణాల వల్ల వదిలేయరు కదా. కానీ.. ఇద్దరు ఇంజనీర్లు మాత్రం తమ కార్పొరేట్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి బిర్యానీ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉద్యోగం కన్నా ఎక్కువ సంపాదిస్తూ యూత్కు ఆదర్శంగా నిలుస్తున్నారు.
హర్యానాలోని సోనెపట్కు చెందిన ఇద్దరు ఇంజనీర్లుకు 9 టు 5 జాబ్ అస్సలు నచ్చలేదు. అందుకే.. దాన్ని వదిలేశారు. బిర్యానీ సెంటర్ పెట్టారు. ఉద్యోగం మీద విరక్తి, చాలీచాలని జీతం.. రెండూ వాళ్లను స్వయం ఉపాధి వైపు మళ్లించాయి. అందుకే ఇంజనీర్స్ వెజ్ బిర్యానీ(Engineer’s Veg Biryani) పేరుతో బిర్యానీ సెంటర్ను పెట్టి ఇప్పుడు ఉద్యోగంలో సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.
రోహిత్, సచిన్.. ఇద్దరూ ఇంజనీర్స్ వెజ్ బిర్యానీని స్థాపించి రూ.50కే హాఫ్ బిర్యానీ, రూ.70 కే ఫుల్ ప్లేట్ అందిస్తున్నారు. సోనెపట్తో పాటు పలు లొకేషన్లలో బిర్యానీ సెంటర్ను ఏర్పాటు చేశారు. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం మాత్రమే చేయాలి అనే మైండ్సెట్ నుంచి ముందు యూత్ బయటికి రావాలని.. ఏ పని అయినా నూటికి నూరు శాతం దృష్టి పెట్టి చేస్తే డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం కాదని.. యూత్కు సలహా ఇచ్చారు సచిన్, రోహిత్.