న్యూఢిల్లీ: తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు మాజీ చైర్మన్ నీసమణిమారన్ ముత్తుకు చెందిన సుమారు 293.91 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెండ్ డైరక్టరేట్ సీజ్ చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా) చట్టం కింద నమోదు అయిన కేసులో ఆ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లోతుగా విచారణ జరగుతున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. నీసమణిమారన్ ముత్తుకు విదేశాల్లో హోటళ్లు ఉన్నాయి. అతనికి పోర్చుగల్లో గోల్డెన్ వీసా పర్మిట్ ఉంది. వైన్ పరిశ్రమలో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.